Wednesday 20 January 2010

అమరవీరులంటే ఎవరు?

బ్రతకడం చాత కాక, బ్రతుకు విలువ తెలీక, అవగాహనా రాహిత్యంతో ప్రాణాలు తీసుకునేవారు అమరవీరులు అవుతారా? తెలంగాణా సాయుధ పోరాటంలో నేలకొరిగిన ఎందరో సామాన్య ప్రజలు అమరవీరులు - వారు కనీసం ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కున్నారు. అన్యాయానికి ఎదురు నిలిచారు. సాహసంతో ముందుకు ఉరికారు. వారితో ఈ ఆత్మహత్యా వీరులని పోల్చి, ఆ నిజమైన అమరవీరులని అవమానిచడానికి ఈ జే ఏ సీ నాయకులకి, తెలంగాణా వేర్పాటువాదులకి మనసు ఎలా ఒప్పింది? మన గడ్డపై ఎందరో యోధులు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు. కానీ ఒక్కరు కూడా పిఱికి తనంతో ఆత్మహత్య చేసుకోలేదు. వారి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలుపుకొని, వారు నిజంగా అమరులైనారు ! నిరాశతో, నిస్పృహతో తమ తనువు చాలించేవారు వీరులెలా అవుతారు? జీవితం ఎంతో విలువైనది. మనకు కావలసింది దక్కకుంటే ఎవ్వరికైనా ఆశాభంగం కలుగుతుంది. అయితే, ఆశలు నెరవేరే మార్గం కోసం ప్రయత్నించాలిగానీ, జీవితాన్ని అంతం చేసుకుంటే ఆశ ఫలిస్తుందా? మన పై ఎన్నో ఆశలు పెట్టుకుని, మనలని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, మనకు చేదోడు వాదోడుగా ఉన్న కుటుంబ సభ్యులు మన మరణంతో ఎంత కృంగిపోతారో ఒక్కసారి ఆలోచిస్తే, ఇలాటి పిచ్చి పనులు ఎవ్వరూ చేయరు. కానీ ఇలా తమని తాము చంపుకొన్న వారికి అమరత్వాన్ని ఆపాదించి అమర వీరులుగా కీర్తించి, హీరోలుగా చిత్రీకరిస్తే, ఇంకెందరు ఆ భావోద్వేగంలో కొట్టుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటారో అన్న కనీస విచక్షణ ఈ నాయకులకి లేదా? తెలంగాణా రాష్ట్రం వస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మీడియా అంతా చనిపోయిన ఒక విద్యార్ధిని గురించి అంతగా ఘోషిస్తూ ఉంటే - ఇంకెందరు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ అమరత్వాన్ని పొందుదామని స్ఫూర్తి పొందుతారో వీరికి అర్ధం కాదా? ఇలాటి చావులకి ప్రభుత్వాలు కాదు, వారి మైండ్ సెట్ ని ప్రభావితం చేస్తున్న వేర్పాటు వాదులు, విభజన వీరులు, మీడియా బాధ్యత వహించాలి. మనుషులని చంపే ఉద్యమాలు కాదు - చేతనైతే, మానవీయ విలువలని కాపాడే ఉద్యమాలు మనకి ఇప్పుడు అవసరం. చిన్నారి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా - చెప్పుడు మాటలు విని, బంగారు భవిష్యత్తుని మీరు మీ చేతులతో నాశనం చేసుకోకండి. మీ చదువులను పాడు చేసుకోకండి. విద్యార్ధి జీవితం ఒకసారి పోతే మళ్ళీ రాదు, మీజ్ఞానాన్ని పెంచుకుని, దేశానికి ఉపయోగపడే పనులు చెయ్యండి. మీ చదువులు పూర్తి చేయడానికి కష్టపడండి, తప్పక తరువాత ఆ కష్టం విలువ మీకు తెలిసి వస్తుంది. చేతనైతే ఒకరినుంచీ మంచి నేర్చుకోండి - అంతే గానీ విద్వేషాలు మనసుల్లో నింపుకోకండి. మన తల్లితండ్రుల కలలు మన ద్వారానే సాకారం అవుతాయని గ్రహించండి. జీవితాన్ని జీవించండి. ఈరోజు మిమ్మల్ని రెచ్చగొడుతున్న ఈ నాయక గణంలో ఒక్కరి పిల్లలు కూడా ప్రాణాలు తీసుకోవడంలేదు - అది గమనించండి. ఆత్మహత్య ఏనాటికీ అమరత్వం కాదని గుర్తెరగండి. రాష్ట్రం వస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మీడియా అంతా చనిపోయిన ఒక విద్యార్ధిని గురించి అంతగా ఘోషిస్తూ ఉంటే - ఇంకెందరు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ అమరత్వాన్ని పొందుదామని స్ఫూర్తి పొందుతారో వీరికి అర్ధం కాదా? ఇలాటి చావులకి ప్రభుత్వాలు కాదు, వారి మైండ్ సెట్ ని ప్రభావితం చేస్తున్న వేర్పాటు వాదులు, విభజన వీరులు, మీడియా బాధ్యత వహించాలి. మనుషులని చంపే ఉద్యమాలు కాదు - చేతనైతే, మానవీయ విలువలని కాపాడే ఉద్యమాలు మనకి ఇప్పుడు అవసరం. చిన్నారి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా - చెప్పుడు మాటలు విని, బంగారు భవిష్యత్తుని మీరు మీ చేతులతో నాశనం చేసుకోకండి. మీ చదువులను పాడు చేసుకోకండి. విద్యార్ధి జీవితం ఒకసారి పోతే మళ్ళీ రాదు, మీజ్ఞానాన్ని పెంచుకుని, దేశానికి ఉపయోగపడే పనులు చెయ్యండి. మీ చదువులు పూర్తి చేయడానికి కష్టపడండి, తప్పక తరువాత ఆ కష్టం విలువ మీకు తెలిసి వస్తుంది. చేతనైతే ఒకరినుంచీ మంచి నేర్చుకోండి - అంతే గానీ విద్వేషాలు మనసుల్లో నింపుకోకండి. మన తల్లితండ్రుల కలలు మన ద్వారానే సాకారం అవుతాయని గ్రహించండి. జీవితాన్ని జీవించండి. ఈరోజు మిమ్మల్ని రెచ్చగొడుతున్న ఈ నాయక గణంలో ఒక్కరి పిల్లలు కూడా ప్రాణాలు తీసుకోవడంలేదు - అది గమనించండి. ఆత్మహత్య ఏనాటికీ అమరత్వం కాదని గుర్తెరగండి.

Tuesday 5 January 2010

హైదరాబాదు 1956 లోనే చాలా అభివృధ్ధి చెంది ఉంది

"హైదరాబాదు 1956 లోనే చాలా అభివృధ్ధి చెంది ఉంది - కొత్తగా అభివృధ్ధి చెందినది ఏమీ లేదు" - (హైదరాబాదు కోసం తెలంగాణా వారు చెప్పే పేద్ద అబద్ధం)

అలా అయితే - 1956 తరువాత హైదరాబాదులో పెట్టిన పరిశ్రమలను, విశ్వ విద్యాలయాలను, పాఠశాలలను, కళాశాలలను, ఐ.ఐ.టీ, ఐ.యెస్.బి లాటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను, అనేక కార్యాలయాల ప్రధాన శాఖలను, అలాగే ప్రతీఎ ఒక్క పెద్ద రోడ్డునూ, ఫ్లై ఒవర్ బ్రిడ్జీలనూ - అన్నీ తెచ్చినది సీమాంధ్ర ముఖ్య మంత్రులే కనుక, సీమాంధ్ర కి ఇచ్చేస్తారా? మా తెలుగు లిపి ని మాకు ఇచ్చి తెలంగాణాకి వేరే లిపిని పెట్టుకుంటారా? ఇక్కడ లక్షలు పెట్టి ఇళ్ళు కట్టుకున్న ప్రతీ ఒక్కరికీ ఎంత ఖర్చుపెట్టారో అంత డబ్బు ఇచ్చేస్తారా? ఊరికే మాట్లాడడం సులభం. మీరు కష్ట పడి సంపాదించిన ఆస్థి ఎవరైనా లాగేసుకుంటే - తీసుకొమ్మని ఇచ్చేస్తారా? ఈ రాష్ట్రం అందరిదీ అని అన్ని ప్రదేశాలకీ పరిశ్రమలు తీసుకు వస్తే - తెలంగాణా లో ఉన్నవన్నీ నావి. అని ఈ రోజు మాట్లాడుతున్నారు. అలాగే ఇంతకు మునుపు నిజాం ఏలుబడిలో ఉన్న మహారాష్ట్ర జిల్లాలనీ, కర్ణాటకా జిల్లాలనీ తెలంగాణా రాష్ట్రంలో కలపాలి కదా.... కేవలం ఈ 10 జిల్లాలే విడిపోతే అది సరి అయింది ఎలా అవుతుంది? తెలంగాణా లో ప్రాజెక్టులు కట్టే అవకాశం నిజంగా ఉన్నదా? సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న దక్కను పీఠభూమిలో ఎంతవరకూ డాములు కట్టగలము? తెలంగణా ప్రత్యేక రాష్ట్రం అయిపోతే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? చిన్న రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు అవసరం? అప్పుడు మరి ఈ ఉద్యమించిన నిరుద్యోగులు ఏమి చేస్తారు? ప్రత్యేక వరంగల్, ప్రత్యేక అదీలాబాద్ కావాలంటారా? కృష్ణా, గోదావరీ నదుల నీరు ఎన్ని జిల్లాలకి సరిపోతుంది? అస్సలు అక్కడ ప్రాజెక్టులు కట్టడం ఎంత వరకూ నిజంగా సాధ్యం? అస్సలు ముందు ఈ రాజకీయ నాయకుల పొట్టలు నింపడానికి వచ్చే నిధులు సరిపోతాయా? హైదరాబాదులో అన్ని రాష్ట్రాల వారూ ఉన్నారని చెబుతున్న వీరంతా అందరికన్నా ఎక్కువగా ఉన్న సాటి తెలుగువారిని ఎంత హీనంగా చూస్తున్నారు? "మాకు అన్యాయం జరిగింది.... మమ్మల్ని దోచుకుంటున్నారు.... మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం.... మా రాష్ట్రం మాకు ఇవ్వండి....." ఎన్ని సార్లు అలా మాట్లాడుతారు? "తెలంగాణాకి అడ్డమొస్తే అడ్డంగా నఱికేస్తాం" అని నినదిస్తున్న వారు విద్యార్ధులా? అలాగైతే ప్రతీ ఒక్క చిన్న రాష్ట్రాన్నీ ఇచ్చేయాలి. సర్దార్ వల్లభ్ భాయి పటేల్ భారత ప్రభుత్వంలో విలీనం చేసిన సంస్థానాలన్నీ ఒక్కో రాష్ట్రంగా అవతరిస్తాయి. మళ్ళీ ఇంకో సారి మనం పర పాలనకి తెరలు తీద్దాం ! కష్టపడి సాధించుకున్న స్వరాజ్యాన్ని మళ్ళీ పరతంత్ర్యంగా మార్చేద్దాం. ఒకడి క్రింద బతకలేమని చెప్పి - మనలో మనమే కుమ్ముకొని వేరే వాడికి భారత దేశాన్ని సమర్పిద్దాం ! అమ్మా తెలుగు తల్లీ, నిన్ను దయ్యం అనేవారి నాలుకల్లో పలికే ఒక్కో తెలుగు మాటా సరైనదిలా వచ్చేలా చూడు తల్లీ! తెలుగు జాతికి సద్బుధ్ధి ప్రసాదించు - మాలో మాకు తగవులు పెడుతున్న వారిని గుర్తించి మమ్మల్ని ఒక్కటిగా ఉండేలా దీవించు తల్లీ! మూర్ఖులకి తెలివి నిచ్చి జాతి సమైక్యత ని విఛ్ఛిన్నం కాకుండా చూడు తల్లీ! నాకు తెలుసు - మళ్ళీ తెలంగాణా వాదులు చాలా పిచ్చి మాటలు రాస్తారని.... కానీ వారందరికీ ఒకటే విన్నపం. ఈ రాష్ట్రం అందరిదీ. అలాగే హైదరాబాదు నా రాష్త్ర రాజధాని కనుక నాది అనే హక్కు ప్రతీ ఒక్క తెలుగు వ్యక్తికీ ఉన్నది. నేను ముందు తెలుగు వాడిని, నా రాష్త్రం తెలుగు వారికి ప్రతీక కనుక నా రాష్త్రం విడిపోకూడదు అని ఆశించడం ప్రతీ ఒక్కరి హక్కూ, బాధ్యత కూడా. ఇప్పుడు జరిగిన అందోళనల వల్ల కలిగిన నష్టాన్ని ఉపయోగించి మన రాష్త్రంలో చాలా వెనుక బడి ఉన్న ప్రాంతాలని అభివృధ్ధి చేయగలిగే వారం. ఎదుటివారిని తిట్టడం సంస్కారం కాదు - చేతనైతే ఎదుటివారివద్దనుంచీ మంచి విషయాలను నేర్చుకోండి. కష్టపడకుండా ఎవ్వరూ ఏమీ సాధించలేరు. ఏ ప్రాంతం వారైనా కష్టపడగలిగే వారు తప్పక పైకి వస్తారు. మనది అనే మాటకి ఉన్న బలం నాది అనే మాటకి లేనే లేదు. ఐకమత్యంగా ఉంటే మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవాల్సి వస్తుందని - కొందరు పన్నిన ఎత్తుగడ ఫలించి, వేర్పాటువాదం ఎక్కువ అయ్యింది..... హైదరాబాదుకి రావలసిన ప్రాజెక్టులన్నీ చెన్నయ్ కీ, బెంగుళూరుకీ తరలిపోతున్నాయి. మన చేతులతో మనమే మన భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాము.... అది గుర్తించండి. ఎదుటివారికి అవకాశాలు వస్తున్నాయని వాపోకుండా వారిలా మీరూ కష్టపడండి. మన చేతకాని తనాన్ని ఎదుటి వాడి దోపిడీ అనకండి -- హైదరాబాదు శివారు గ్రామాల్లో ఎకరాలకి ఎకరాలు కోట్లు కుమ్మరించి కొన్న వారిలో ఎక్కువ శాతం తెలంగాణేతరులే ! కష్టపడి పని చేయాలనుకునే ఎవ్వరూ మన అభివృధ్ధిని అపలేరు. ఇప్పుడున్న పోటీ వాతావరణంలో అదే ముఖ్యం. కానీ చదువులు మానేసి, రోడ్ల మీదికి ఎక్కితే అది వారికే నష్టం. ఈ సంగతి ఉద్యమాలు చేస్తున్న విద్యార్ధులందరూ అర్ధం చేసుకోవాలి.